
కలకత్తా, 08 మే (హి.స.)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. అధికార టీఎంసీ (TMC) పార్టీని మట్టికరిపించింది. ఈ క్రమంలో తాజాగా బెంగాల్ సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉండగా.. తాజాగా ఈ అంశంపై స్పష్టత వచ్చేసింది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సువేందు పేరును ప్రతిపాదించారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. భవానీపూర్లో మమతా బెనర్జీ మీద ఏకంగా 15 వేల ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. త్వరలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi