అమరావతిపై వైసీపీ కక్షగట్టింది: మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతిపై వైసీపీ కక్షగట్టింది: మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతిపై వైసీపీ కక్షగట్టింది: మంత్రి నాదెండ్ల మనోహర్


హైదరాబాద్, 28 జూన్ (హి.స.)

రాష్ట్ర రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దాడులకు తెగబడుతోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉందని, రైతులపైకి దండయాత్రలా వెళ్లి రాళ్ల దాడికి దిగడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జగన్ మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతోనే మొదలైందని, ప్రజావేదిక కూల్చివేత నుంచి నేటి రాళ్ల దాడి వరకు వైసీపీ దుష్ట ఆలోచనలు బయటపడుతూనే ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో గతంలో రైతులను నట్టేట ముంచారని, ఇప్పుడు ప్రజలు తిరస్కరించినా మావిగన్ వంటి విచిత్రమైన పేర్లతో హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande