ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు: కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర..
ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు: కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర..
kedarnath


రుద్రప్రయాగ్ (ఉత్తరాఖండ్):, 18 జూలై (హి.స.)

భారీ వర్షాల కారణంగా కొండచరియలు, పెద్ద పెద్ద బండరాళ్లు విరిగిపడి తాత్కాలికంగా నిలిచిపోయిన కేదార్‌నాథ్

కాలినడక (ట్రెకింగ్) మార్గాన్ని శనివారం ఉదయం అధికారులు భక్తుల కోసం తిరిగి

ప్రారంభించారు.శుక్రవారం

ఉదయం గౌరీకుండ్ గేట్ సమీపంలో, గౌరీకుండ్ -

చిర్బాసా మధ్య ఉన్న ట్రెకింగ్ మార్గంలో పలుచోట్ల భారీగా కొండచరియలు విరిగిపడటంతో

పాటు రాళ్లు దొర్లిపడ్డాయి.దీంతో

ప్రయాణికుల భద్రతను దృష్ట్యా అధికారులు ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన

జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA), పీడబ్ల్యూడీ

విపత్తు నివారణ బృందాలు (PWD Disaster Response) మరియు

ఇతర శాఖల అధికారులు యుద్ధప్రతిపాదికన ఘటనా స్థలానికి చేరుకున్నారు.మార్గంలో పేరుకుపోయిన శిథిలాలను, బండరాళ్లను తొలగించేందుకు భారీ యంత్రాలతో నిరంతరాయంగా క్లియరెన్స్

పనులు చేపట్టారు.దాదాపు

కొన్ని గంటల పాటు శ్రమించి మార్గాన్ని పాక్షికంగా పునరుద్ధరించారు.ప్రస్తుతం గౌరీకుండ్ వద్ద మోహరించిన

డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) సిబ్బంది

ప్రమాదకర ప్రాంతాలలో భక్తులు కాలినడకన సురక్షితంగా దాటడానికి సహాయం

అందిస్తున్నారు.

ఈ యాత్రా పునరుద్ధరణపై రుద్రప్రయాగ్

జిల్లా మెజిస్ట్రేట్ (DM) విశాల్ మిశ్రా అధికారికంగా వివరాలు

వెల్లడించారు.ప్రస్తుతం

కేదార్‌నాథ్ ధామ్ యాత్ర కాలినడకన వెళ్లే భక్తుల కోసం సాఫీగా సాగుతోందని ఆయన

తెలిపారు.అయితే మార్గంలో

ఇంకా పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటం వల్ల, వాటిని

పూర్తిగా తొలగించే వరకు గుర్రాలు, కోడెల (Mules)

రాకపోకలను అనుమతించడం లేదని చెప్పారు.చిర్బాసా వంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా బండరాళ్లను తొలగించే పనులు

జరుగుతున్నాయని, ఈ మార్గం పూర్తిగా సురక్షితమని

నిర్ధారించుకున్న తర్వాతే గుర్రాల సేవలను పునఃప్రారంభించాలని ఆపరేటర్లకు ఆదేశాలు

జారీ చేశామని డీఎం వివరించారు.ప్రయాణికుల

రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని, అందువల్లే రోడ్డు

క్లియరెన్స్ పనుల కోసం యాత్రను కాసేపు నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande