
న్యూఢిల్లీ, 19 జూలై (హి.స.)
భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లుఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక 'జపాన్ ఓపెన్ సూపర్ 750' టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన సింధు.. తన కెరీర్లో మొట్టమొదటిసారి, ఏ భారత షట్లర్కు సాధ్యం కాని 'జపాన్ ఓపెన్' టైటిల్ను కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ స్టార్ షట్లర్, డిఫెండింగ్ ఛాంపియన్ అకానె యామగుచీపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్లో జపాన్ క్రీడాకారిణి గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సింధు అద్భుతంగా పుంజుకుంది. తన అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థి యామగుచీని ఒత్తిడిలోకి నెట్టి 21-14, 21-17 తేడాతో వరుస గేమ్స్ ఘన విజయం సాధించింది.
కాగా, కొంతకాలంగా సరైన టైటిల్ లేక ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పీవీ సింధుకు ఈ విజయం కాస్త ఊరట కలిగించింది. తాజాగా టైటిల్ గెలుపుతో ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్గా సింధు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు