
తిరుచానూరు, 03 జూలై (హి.స.) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఈ రోజు శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయులు, రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV