ఏపీ తరఫున మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు హైదరాబాదీ ఫసిహా నౌమన్
ఏపీ తరఫున మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు హైదరాబాదీ ఫసిహా నౌమన్
miss


హైదరాబాద్, 06 జూలై (హి.స.)

హైదరాబాద్‌కు చెందిన మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఫసిహా నౌమన్ ప్రతిష్ఠాత్మక 'మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తల్లి అయిన కొద్ది నెలలకే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయంతో ఆమె ఈ నెలలో నిర్వహించనున్న 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అందాల పోటీల బరిలోకి దిగిన ఆమె, అద్భుత విజయన్ని అందుకున్నారు.

వివాహితులు, తల్లులు సైతం అందాల పోటీల్లో పాల్గొనవచ్చని మిస్ యూనివర్స్ సంస్థ నిబంధనలను సవరించడం ఫసిహాకు తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీలు జులై 19 నుంచి ఆగస్టు 23 వరకు జరగనుండగా, ఢిల్లీలో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారు నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande