
ముంబై,30 ఆగస్టు (హి.స.)బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి కాస్త .. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఆదివారం (ఆగస్టు 30) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,58,240 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,050 గా ఉంది.
వెండి కిలో ధర రూ.2,55,000 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,58,240, 22 క్యారెట్ల ధర రూ.1,45,200 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,240, 22 క్యారెట్ల ధర రూ.1,45,050 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 లుగా ఉంది.
L
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV