
కడప , 31 ఆగస్టు (హి.స.) కడప జిల్లాల్లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2న ఇడుపల పాయకు చేరుకోకున్నారు. అక్కడ నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక పార్థనలు నిర్వహించి నివాళులర్పించనున్నారు. అనంతరం బెంగళూరు వెళ్లిపోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV