
నిజామాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో విలీన గ్రామమైన కోటార్ మూర్ రెవెన్యూ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ లు ఏ తీరుగా ఉన్నాయి.. అని తెలుసుకునేందుకు పరిశీలనకు వెళ్లి అన్ని కలియతిరిగారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు