నెల్లూరులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సింహపురి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
నెల్లూరులో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!


నెల్లూరు, 13 సెప్టెంబర్ (హి.స.) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సింహపురి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

నెల్లూరు కూరగాయల మార్కెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రకృతికి హాని కలగకుండా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande