
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ పేరిట విస్తృత వేడుకలను నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్ 17న సూర్యాస్తమయం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఒక కోటి కుటుంబాలు తమ ఇళ్లలో ‘ఆశీర్వాద దీపాలు’ వెలిగించే కార్యక్రమంలో పాల్గొంటాయి. ముఖ్యంగా కోల్కతాలోని గంగా నది తీరంతో పాటు నబన్నా, రైటర్స్ బిల్డింగ్, విక్టోరియా మెమోరియల్ మరియు కాళీఘాట్ ఆలయం వంటి చారిత్రక ప్రాంగణాలను దీపాలతో విద్యుద్దీప శోభితంగా అలంకరించనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని దాదాపు 80,000 పాఠశాలల్లో విద్యార్థులకు ‘వికసిత్ భారత్ 2047’ అంశంపై చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేశారు.దీంతో పాటు ‘అన్నపూర్ణ దివస్’ నిర్వహణ, రక్తదాన శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలు మరియు సైకిల్ ర్యాలీలను ప్లాన్ చేశారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా మరియు ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు అక్టోబర్ 7 వరకు కొనసాగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi