
హుస్నాబాద్, 03 సెప్టెంబర్ (హి.స.)
నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న ఆర్అండ్్బ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
నియోజకవర్గంలో ప్రతిపాదించిన ఆర్అండ్బై రోడ్లకు మంజూర్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారిపై పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు, మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆరీబీ) పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. ఈ పనులు పూర్తయితే వాహనదారుల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట వైపు వెళ్లే రహదారులు కలుస్తున్నాయని, రహదారి ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కరీంనగర్-ఎల్కతుర్తి, ఎల్కతుర్తి -హనుమకొండ మధ్య కొనసాగుతున్న రహదారి పనులను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..