
కాకినాడ, 03 సెప్టెంబర్ (హి.స.)
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
ఆటో కిర్లంపూడి మండలం కృష్ణవరం నుంచి దుర్గాడ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ