‘గగన్యాన్’ మొదటి ప్రయోగం త్వరలోనే నిర్వహిస్తాం: ఇస్రో
'గగన్యాన్'కు సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు.
ఇస్రో చైర్మన్ నారాయణన్


నెల్లూరు, 04 సెప్టెంబర్ (హి.స.) భారతదేశపు తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్'కు సంబంధించిన మొదటి ప్రయోగం త్వరలో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ ప్రయోగం విజయమైంది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది తొలి విజయమని స్పష్టం చేశారు. మరో ఆరు ప్రయోగాలని నిర్వహిస్తామని తెలిపారు.

శుక్రవారం ఉదయం ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్.. నిర్దేశించిన 19 నిమిషాల్లోనే శాటిలైట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నిర్దేశిత సమయంలో 28,934 కిలోమీటర్లు ప్రయాణించి నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరింది.

వాతావరణం, భూ పరిశీలనకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈ శాటిలైట్ EOS-05 అందించనుంది.

ఈ రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత సాంకేతిక నైపుణ్యం, శాస్త్రవేత్తల కృషికి ప్రతీకగా మరో చారిత్రాత్మక విజయంగా నిలిచింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande