ఆంధ్రప్రదేశ్ 29 మార్చ్ (హిం.స(సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఒక్క ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్ప.. మిగిలిన ముగ్గురు కొత్త వ్యక్తులేనని తెలుస్తోంది. అయితే.. అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తన మార్క్ చూపించారని.. టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో కచ్చితంగా మూడు టీడీపీవేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
హిందూస్తాన్ సమాచార రాజీవ్