మమతా బెనర్జీ మరోసారి గాయం
కోల్‌కతా: 27 ఏప్రిల్ ( హింస)పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హ
మమతా బెనర్జీ మరోసారి గాయం


కోల్‌కతా: 27 ఏప్రిల్ ( హింస)పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన ఆమె అదుపుతప్పి తూలి కింద పడిపోయారు. ఈ మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి దీదీ అసన్‌సోల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డారు.

దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ సీఎం తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. అసన్‌సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) నుంచి అలనాటి నటుడు, ఎంపీ శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ నేడు ప్రచారం చేపట్టారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande