ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి.. మధు యాష్కి గౌడ్
హైదరాబాద్ ఏప్రిల్ 18 (హిం.స): సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని తెలంగాణ రాష్ట్ర కాంగ్
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి.. మధు యాష్కి గౌడ్


హైదరాబాద్ ఏప్రిల్ 18 (హిం.స): సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన కర్మన్ ఘాట్ లోని ఎన్ విలేజిలో గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మధుయాష్కి తో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అట్టి కార్పొరేషన్కు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పట్టు విడవని విక్రమార్కులని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande