రాజమండ్రి19.ఏప్రిల్ (హిం.స): ఏపీలో ట్రిబుల్ ఇంజన్ పాలన అవసరమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ) అన్నారు. శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వరి నివాసం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వీకే సింగ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ఎన్డీయే కూటమి అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు తన నామినేషన్ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారని చెప్పారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్