దిల్లీ: 26 ఏప్రిల్ *హిం.స)సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ () ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్లోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు, ఉత్తర్ప్రదేశ్లోని మథుర, రాజస్థాన్లో బన్స్వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించి నిరసన తెలిపారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్