విశాఖపట్నం,27 ఏప్రిల్ (హిం.స) ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. దీన్ని అధిగమించేలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ కూపన్ల, మహిళలకు, నాయకులకు నగదు పేరిట ఎర వేస్తున్నారు. అలా పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల అధికార పార్టీ అభ్యర్థి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారికి ‘కూపన్ల’పై పెట్రోల్ పోసిన బంకును జిల్లా అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏదో విధంగా గట్టెక్కాలనే లక్ష్యంతో అధికార పార్టీ అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఓటర్లకు తాయిలాలు అందించారు. వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డు సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సంఘాల సభ్యులు, ఆర్పీలు, కుల సంఘాలు, యూత్ సభ్యులకు ప్రత్యేక బహుమతుల్ని గుట్టుచప్పుడు కాకుండా చేరవేసేశారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్