నేడు భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Telangana, బిజినెస్.10 జూలై (హి.స.) రికార్డు స్థాయి ర్యాలీ కొనసాగిస్తున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నేడు నష్టాలు ఎదురయ్యాయి. గత కొన్ని సెషన్లలో కొత్త గరిష్ఠాలను తాకుతున్న సూచీలు బుధవారం భారీగా నష్టపోయాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలవడంతో సెన్సెక
స్టాక్ మార్కెట్


Telangana, బిజినెస్.10 జూలై (హి.స.)

రికార్డు స్థాయి ర్యాలీ కొనసాగిస్తున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నేడు నష్టాలు ఎదురయ్యాయి. గత కొన్ని సెషన్లలో కొత్త గరిష్ఠాలను తాకుతున్న సూచీలు బుధవారం భారీగా నష్టపోయాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ మొదలవడంతో

సెన్సెక్స్ ఇండెక్స్ ఓ దశలో 80,481 వద్ద

కొత్త గరిష్టాలను తాకింది. అనంతరం

మిడ్-సెషన్కు ముందు ఏకంగా 900

పాయింట్ల వరకు కుదేలయ్యాయి.

ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల

నుంచి మద్దతు లేకపోవడం, దేశీయంగా

ఆల్టైమ్ హై స్థాయిల వద్ద మదుపర్లు

లాభాల స్వీకరణకు దిగడం, కీలక ఐటీ

రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి

కారణంగా స్టాక్ మార్కెట్లు క్షీణించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి

సెన్సెక్స్ 426.87 పాయింట్లు పతనమై

79,924 వద్ద నిఫ్టీ 108.75 పాయింట్లు

నష్టపోయి 24,324 వద్ద ముగిశాయి.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande