ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 30 మంది పాకిస్తానీ యాత్రికుల మృతి
ఇరాన్, 21 ఆగస్టు (హి.స.) సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ఞాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు అతివేగంతో అదుపతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 30 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 23 మంది తీ
ఇరాన్ లో బస్సు ప్రమాదం


ఇరాన్, 21 ఆగస్టు (హి.స.)

సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ఞాలో

ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు అతివేగంతో అదుపతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 30 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 23 మంది తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకింగ్ సిస్టమ్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతులంతా ఇరాక్ లోని కర్బలా గవర్నరేట్లో షియా ముస్లింల అర్బయిన్ తీర్థ యాత్రకు వచ్చిన పాకిస్థానీయులుగా ఉన్నతాధికారులు తేల్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్ / నాగరాజ్ రావు


 rajesh pande