
తిరుపతి, 13 నవంబర్ (హి.స.)
:టీటీడి కి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐభాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
- తిరుపతిలోని టీటీడీ భూదేవి కాంప్లెక్సులో సీబీఐ డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని సీబీఐ డీఎస్పీలు, సిట్ దర్యాప్తు అధికారి వెంకట్రావు ఇతర పోలీసు అధికారులు కల్తీ నెయ్యి కేసులో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిలిజైన్, విపిన్జైన్తో పాటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళ, బుధవారాల్లో విచారించారు. దీంతో ఇక్కడ కూడా హడావుడి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ