
అమరావతి, 9 నవంబర్ (హి.స.)
పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ () ప్రారంభించారు. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్ కల్యాణ్కు అధికారులు తెలిపారు. వీటి ద్వారా జనావాసాలు, పొలాల్లోకి వచ్చే అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తారో వివరించారు. కుంకీ ఏనుగుల విన్యాసాలను పవన్ కల్యాణ్ తిలకించారు. వాటికి ఆహారం తినిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ