
అమరావతి, 9 నవంబర్ (హి.స.)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెుంథా తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తుఫాన్ దెబ్బకు వేల హెక్టార్ల పంటలు దెబ్బతినగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే కూటమి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం నివారించగలిగారు. మూడ్రోజులపాటు నిత్యం అధికారులతో సమీక్షలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ నష్ట నివారణకు రాత్రింబవళ్లు కృషి చేశారు. అయితే, తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం నుంచి కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించనుంది. రెండు టీములుగా విడిపోయి మెుంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ