, హైదరాబాద్ 14 మార్చి (హి.స.)
: రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఇప్పటికే షెడ్యూలు ప్రకారం ఈ నెల 10, 11 తేదీల్లో గ్రూప్-1, గ్రూప్-2 రాతపరీక్షల మార్కులను కమిషన్ వెల్లడించింది. 14న గ్రూప్-3 జనరల్ ర్యాంకు జాబితా వెల్లడికానుంది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా..నవంబరు 17, 18 తేదీల్లో రాతపరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థుల హాజరు నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల