రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
రాజస్థాన్, 20 మార్చి (హి.స.) రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై లారీ ట్రాలీ పడటంతో నుజ్జునుజ్జు అయ్యి కారులోని ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బికనీర్ లోని దేశ్ నోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ కారులో మహిళ సహ
చందానగర్ లో రోడ్ యాక్సిడెంట్


రాజస్థాన్, 20 మార్చి (హి.స.)

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై లారీ ట్రాలీ పడటంతో నుజ్జునుజ్జు అయ్యి కారులోని ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బికనీర్ లోని దేశ్ నోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ కారులో మహిళ సహా ఆరుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. కారు దేశ్ నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే లోడ్ తో వెళుతున్న ఓ ట్రక్ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, కారుపై పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఘటనపై సమాచారం అందుకున్న దేశ్ నోక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande