న్యూఢిల్లీ, 14 ఏప్రిల్ (హి.స.)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కు జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా.. అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. ఉత్కంఠంగా జరిగిన ఆ మ్యాచ్లో ముంబై 12 రన్స్ తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19 ఓవర్లలో 193 రన్స్ చేసి ఆలౌటైంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్లో డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్కు ఫైన్ వేశామని, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించినట్లు
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..