ముంబై, 21 మే (హి.స.)ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ కు వెళ్లాయి.
నాలుగవ స్థానం కోసం ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ పోటీ పడుతున్నాయి. ఇందులో ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు నేరుగా వెళుతుంది. అయితే ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. పోరు రసవత్తరంగా ఉండనుంది. కచ్చితంగా ఈ రెండు జట్లు కూడా గెలవాల్సిన పరిస్థితి. అయితే ముంబై సొంత గ్రౌండ్ కావడంతో ఆ జట్టుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెబుతున్నారు.
మరి ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ( Kl Rahul) గాయం ( InjIPL 2025: ముంబైతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్కు చావో రేవోury) కారణంగా అందుబాటులో ఉండబోడని సమాచారం. ప్రాక్టీస్ సమయంలో కె ఎల్ రాహుల్ కు గాయమైందని సమాచారం అందుతుంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ కు దూరం కాబోతున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి