హైదరాబాద్, 29 మే (హి.స.)ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్కు వేళైంది. నేడు ముల్లాన్పుర్ (చండీగఢ్)లో తొలి క్వాలిఫయర్ జరగనుంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడనున్నాయి. క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన టీమ్ నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడాల్సి ఉంటుంది. బెంగళూరు, పంజాబ్ జట్లు మంచి ఫామ్లో ఉన్న నేపథ్యంలో హోరీహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 నుంచి ఆరంభం అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు