అమరావతి, 28 మే (హి.స.)
ఎన్టీఆర్ జిల్లాలో మన బడి మన భవిష్యత్తు రెండో విడతలో జిల్లాకు రూ.235.24 కోట్లు కేటాయించారు. 587 పాఠశాలల్లో రూ.152.23 కోట్లతో అదనపు తరగతి గదులు, విద్యుత్తు, కిటికీలు, తలుపుల పనులు ఆరంభించారు. ఇంకా 185 పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. శ్లాబ్, గోడలు, ప్రహరీ, గ్రీన్ బోర్డులు, ఆంగ్ల ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. అందుకు రూ.83 కోట్లు అవసరం.
జిల్లాలో మిగులు నిధులు.. రూ.3.26 కోట్లు ఉండగా.. వాటిని పాఠశాలలకు సర్దుబాటు చేసే పనిలో సమగ్ర శిక్ష అధికారులున్నారు. పనులు పూర్తయిన బడుల ఖాతాల్లోని నిధులను.. అసంపూర్తి గదులున్న పాఠశాలలకు కేటాయిస్తున్నారు. వాటితో కొన్నిచోట్ల పనులు చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ