తిరుమల, 2 జూన్ (హి.స.) ప్రముఖ నటుడు సోనూ సూద్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. ఈరోజు తెల్లవారుజామున కుటంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. ఆలయ అర్చకులు ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోనూ సూద్ ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నాం. 'నంది' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది అని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి