వికారాబాద్, 3 జూన్ (హి.స.)
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం ఎర్రవల్లి, ఆలంపల్లిలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు. సాదా బైనామా, పిఓపి, భూ విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, పాసు పుస్తకాల అందజేత తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్