హైదరాబాద్, రామగుండం. 3 జూన్ (హి.స.)
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంగళవారం కమీషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు విధించామన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్