జోగులాంబ గద్వాల, 3 జూన్ (హి.స.) గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి కీలకంగా మారుతోందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల్ మండలం అనంతపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొని భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్ట్రార్లు, దరఖాస్తుదారులకు ఇస్తున్న రశీదు, ఏ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారి భూ సంబంధిత సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కార మార్గాలపై సూచనలు ఇచ్చారు. అధికారులకు తగిన మార్గదర్శకాలు తెలియజేసి, సమస్యలు వేగంగా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్