కర్నూలు, 31 మే (హి.స.)
:జిల్లాలోని ఆదోనీలో క్రికెట్ బెట్టింగ్ ముఠా )యథేచ్ఛగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్లు అందుబాటులోకి రావడంతో క్రికెట్ బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా యువతకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ముగ్గులోకి దింపుతున్నారు. పలు బెట్టింగ్ యాప్ల ద్వారా యువతను ఇందులోకి లాగుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి యువతను బెట్టింగ్ పెట్టేలా చేస్తున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో వందలు, లక్షల్లో యువత అప్పుచేసి మరీ బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్లో యువత ఆర్థికంగా నష్టపోయేలా చేస్తున్నారు. బెట్టింగ్లో డబ్బులు కోల్పోవడంతో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదులు అందండతో దీనిపై దృష్టి సారించారు. ఇవాళ(శనివారం) పలువురిని ఆదోనీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ