ఆగ్రా, 31 మే (హి.స.)
తాజ్మహల్ కు ప్రత్యేక రక్షణ వ్యవస్థను కల్పించారు. ఆ పాలరాతి కట్టడం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదనపు భద్రతలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. తాజ్ సెక్యూర్టీకి చెందిన ఏసీపీ సయ్యద్ ఆరిబ్ అహ్మద్ మాట్లాడుతూ.. తాజ్ పరిసరాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తాజ్మహల్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థను అమర్చినట్లు ఆయన చెప్పారు.
తాజ్మహల్ చుట్టూ 500 మీటర్ల మేర యాంటీ డ్రోన్ వ్యవస్థ నిఘా ఉంటుందన్నారు. తాజ్ నుంచి 500 మీటర్ల చుట్టూ ఎటువంటి డ్రోన్ కనిపించినా దాన్ని గుర్తించి, ధ్వంసం చేస్తుందని ఆరిబ్ చెప్పారు. వాస్తవానికి యాంటీ డ్రోన్ వ్యవస్థ.. సుమారు 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని, కానీ తాజ్ పరిసరాలను సెక్యూర్టీ సున్నిత ప్రదేశంగా భావిస్తూ కేవలం 500 మీటర్ల పరిధికే పరిమితం చేసినట్లు అహ్మద్ తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..