న్యూఢిల్లీ, 2 జూన్ (హి.స.) .లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
జేయూడీ నాయకుడు, ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సైఫుల్లా కసూరితో పాటు మరో ఉగ్రవాది ముజమ్మిల్ హష్మీ ఈ వారంలో దీనిపై వ్యాఖ్యానించారు. “1971లో పాకిస్తాన్ ముక్కలైనప్పుడు నాకు నాలుగేళ్లు. అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండు దేశాల సిద్ధాంతాన్ని బంగాళాఖాతంలో ముంచానని ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు