ఢిల్లీ., 9 మే (హి.స.)
భారతదేశంలో పాక్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షించేందుకు కీలక స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఘర్షణాత్మక దాడుల అనంతరం దేశ రాజధానిలో రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కీలక భేటీకి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. వారందరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థుతులపై సమగ్రంగా చర్చించారని తెలుస్తోంది. సరిహద్దుల్లో చొరబాట్ల ముప్పు నేపథ్యంలో భద్రతా వ్యూహాలను పునఃపరిశీలించడం, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ భేటీలో ప్రధాన అంశాలుగా నిలిచాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు