దేశ రాజధానిలో కీలక పరిణామం.. మద్రాసీ క్యాంప్ ఆక్రమణల తొలగింపు
ఢిల్లీ , 1 జూన్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌత్ ఈస్ట్ జిల్లా జంగ్‌పురా (Jangpura)లోని బరాపుల్లా (Barapulla)లో డ్రైన్ వెంట ఉన్న మద్రాసీ క్యాంప్‌ లోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకార
దేశ రాజధానిలో కీలక పరిణామం.. మద్రాసీ క్యాంప్ ఆక్రమణల తొలగింపు


ఢిల్లీ , 1 జూన్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌత్ ఈస్ట్ జిల్లా జంగ్‌పురా (Jangpura)లోని బరాపుల్లా (Barapulla)లో డ్రైన్ వెంట ఉన్న మద్రాసీ క్యాంప్‌ లోని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాజాగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం అక్కడున్న ఆక్రమణలను అధికారులు కూల్చివేస్తున్నారు. దాదాపు 300పైగా గుడిసెలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్రాసీ క్యాంప్ చుట్టూ పారా మిలిటరీ బలగాలు, లోకల్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.

కాగా, గత కొన్నిరోజులుగా మద్రాసీ క్యాంప్ ప్రాంత వాసులు పునరావాసం సరిగా లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. అందులో ఇప్పటికే కొన్ని కుటుంబాలకు నరేలా (Narela) ప్రాంతంలో ప్రత్యామ్నాయ గృహాలు అందజేశారు. మద్రాసీ క్యాంప్‌ల మొత్తం 370 గుడిసెలు ఉంటే.. అందులో దాదాపు 215 కుటుంబాలకు ప్రధానమంత్రి ‘జహాన్ ఝుగ్గీ వహా మకాన్’ పథకం కింద పునరావాసానికి అర్హులుగా గుర్తించి ఫ్లాట్లు అందజేశారు. మొదట్లో 189 కుటుంబాలు మాత్రమే పునరావాసం దక్కగా.. సవరించిన జాబితాలో మరో 26 కుటుంబాలు చేర్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande