భారతదేశం స్వభావరీత్యా హిందూ దేశం.. ఇదే అంతిమ సత్యం: బాబా రాందేవ్
కురుక్షేత్ర, 1 జూన్ (హి.స.)పతంజలి వస్తుల ప్రకటనల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రాందేవ్ బ
భారతదేశం స్వభావరీత్యా హిందూ దేశం.. ఇదే అంతిమ సత్యం: బాబా రాందేవ్


కురుక్షేత్ర, 1 జూన్ (హి.స.)పతంజలి వస్తుల ప్రకటనల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. యోగా గురువు రాందేవ్ బాబా (Baba Ramdev) నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.

ఈ క్రమంలోనే ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రాందేవ్ బాబా మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం స్వభావరీత్యా హిందూ దేశం, ముస్లింలు, క్రైస్తవులు, మరే ఇతర పేరుతోనైనా తమను తాము పిలుచుకునే వారి పూర్వీకులు కూడా హిందువులు. భారతీయులు నిత్యం ప్రకృతి, సంస్కృతిని ఆరాధించేవారు. ఇదే అంతిమ సత్యం. ఇప్పుడు, క్రమంగా, అందరూ దీనిని నమ్మడం ప్రారంభించారు.

రాబోయే కాలంలో, ప్రపంచంలోని 500 కోట్లకు పైగా ప్రజలను యోగా, ఆధ్యాత్మికత, సనాతన విలువలతో అనుసంధానించడమే మా లక్ష్యం. ఇది సనాతన ధర్మం యొక్క ప్రపంచ విజయ ప్రయాణం.. అని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు ఆదేశాలతో క్షమాపణలు చేసిన బాబా.. తాజా వ్యాఖ్యలు ఎటువైపు దారి తీస్తాయో తెలియలంటే వేచి చూడాల్సిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande