దిల్లీ:, 1 జూన్ (హి.స.)హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్లాండ్ అభ్యర్థి చేరారు. నువ్వు మస్వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పించారు.. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు వేసి నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో నందిని గుప్తా నిష్క్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా.. విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర కల్పిస్తారు. ఈ పోటీలో ఒకవేళ గెలిచి ఉంటే.. అత్యధిక టైటిళ్ల విజేతగా భారత్ రికార్డు సృష్టించేది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి.. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రానా, విజయ్దేవరకొండ, ఖుష్బూ హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు