దిల్లీ:1 జూన్ (హి.స.)జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారతదేశంలో పాకిస్థాన్తో సంబంధం ఉన్న ఒక గూఢచర్యం కేసులో స్పీడ్ పెంచేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో భారీ సోదాలు (NIA Conducts Raids) నిర్వహించింది. ఈ సోదాలు మే 31, శనివారం రోజున ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో జరిగాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో (PIO) సంబంధాలు ఉన్న అనుమానితుల ఇళ్లలో ఈ సోదాలు చేపట్టారు.
ఈ సోదాల సమయంలో ఎన్ఐఏ బృందాలు అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, సున్నితమైన ఆర్థిక పత్రాలు, ఇతర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ వస్తువులను పాకిస్థాన్ ఆధారిత గూఢచారులు నడిపిస్తున్న గూఢచర్య రాకెట్కు సంబంధించిన సమాచారం కోసం జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం, సోదాలు జరిగిన అనుమానితులు పాకిస్థాన్ గూఢచారులతో సంబంధాలు కలిగి ఉన్నారని, భారత్లో గూఢచర్య కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించే మార్గాలుగా పనిచేశారని తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు