అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో DGCA కీలక ఆదేశాలు..
హైదరాబాద్, 13 జూన్ (హి.స.) అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలంటూ ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా దేశంలోని అన్ని బోయింగ్ విమానాలను తని
విమాన ప్రమాదం


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలంటూ ఆదేశాలిచ్చింది. వీలైనంత త్వరగా దేశంలోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని DGCA స్పష్టం చేసింది.

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా డీజీసీఏ ఆదేశాలతో ఎయిన్ఇండియా చర్యలకు దిగింది. భారత్ లోని అన్ని 787 సిరీస్ బోయింగ్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. అలాగే బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande