ఏవోబీలో కీలక మావోయిస్టు నేతల అరెస్ట్
మల్కన్‌గిరి, 14 జూన్ (హి.స.)ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లన
Maoist sudhakar


మల్కన్‌గిరి, 14 జూన్ (హి.స.)ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు.. ఈ విషయాన్ని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోసిగూడ మరియు టెంటులిగూడె గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారం ఆధారంగా, మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలను చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి మావోయిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు లొంగుపొమ్మని సూచన చేయగా మావోయిస్టులకు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande