అమర్‌నాథ్‌ యాత్రకు దరఖాస్తుల వెల్లువ
అనంతనాగ్‌: , 13 జూన్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటకం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటికే విహారయాత్రలకు టికెట్లు బుక్‌ చేసుకున్న చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. జులైలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రపైనా దీని ప్రభావం
అమర్‌నాథ్‌ యాత్రకు దరఖాస్తుల వెల్లువ


అనంతనాగ్‌: , 13 జూన్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పర్యాటకం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటికే విహారయాత్రలకు టికెట్లు బుక్‌ చేసుకున్న చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. జులైలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రపైనా దీని ప్రభావం పడుతుందని అంతా భావించారు. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారీసంఖ్యలో యాత్రికులు నమోదు చేసుకొంటున్నారు. జమ్మూకశ్మీర్‌ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 3.31 లక్షలమంది అమర్‌నాథ్‌ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. మంచుకొండల మీదుగా అమర్‌నాథ్‌ గుహకు చేరుకొని, సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని సందర్శించాలంటే 45 కిలోమీటర్ల మేర ట్రెక్కింగు చేస్తూ వెళ్లాలి. దీనికి పహల్గాం ఓ బేస్‌ క్యాంపుగా ఉపయోగపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande