ఢిల్లీ, 1 జూలై (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి గడువు తీరిన (ఎండ్-ఆఫ్-లైఫ్) వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధించింది. 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) విశ్లేషణ ప్రకారం, ఢిల్లీలోని స్థానిక కాలుష్య కారకాల్లో 51 శాతం వాహనాల నుంచే వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క ఢిల్లీలోనే సుమారు 62 లక్షల వాహనాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.
ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని 498 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్ను స్కాన్ చేసి, 'వాహన్' డేటాబేస్తో సరిపోల్చుకుంటాయి. ఒకవేళ వాహనం గడువు తీరినట్లు తేలితే, ఆపరేటర్కు హెచ్చరిక వస్తుంది. అదే సమయంలో ఈ సమాచారం పోలీసులకు చేరడంతో, వారు ఆ వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి