ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
ఉత్తరాఖండ్, 26 జూలై (హి.స.) ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. నదులు పొంగిపొర్లటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికా
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక


ఉత్తరాఖండ్, 26 జూలై (హి.స.)

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. నదులు పొంగిపొర్లటంతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ నిలిపివేస్తున్నట్లుగా యాత్రను ప్రకటించారు. తాత్మాలికంగా రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడడంతో యాత్రికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అనుకూలంగా మారిన తరువాత యాత్రను పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న యాత్రికులను అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటన వచ్చేవరకు యాత్రను కొనసాగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande