అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)
, ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ(సోమవారం) ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈఓ శ్యామలరావును సైతం ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంత్రామ్ను బదిలీ చేశారు. రెవెన్యూశాఖ (ఎండోమెంట్) కార్యదర్శిగా ఎం.హరిజవహర్లాల్ను నియమించారు. ఆ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాడ్రేవు వినయ్ చంద్ను రిలీవ్ చేసింది ఏపీ సర్కార్.
అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమించింది ఏపీ సర్కార్. మైనార్టీ, సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్ను బదిలీ చేసింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సురెన్స్, మెడికల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఎం.వి.శేషగిరి బాబు బదిలీ అయ్యారు. ఆయనకు లేబర్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ