అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)
డోన్ నేరవిభాగం: నంద్యాల జిల్లా డోన్ బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఉదయం బాత్రూమ్కి వెళ్లిన విద్యార్థి (16) టెలిఫోన్ వైరుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థి ఇటీవల ఊరికి వెళ్లి నిన్న మధ్యాహ్నం హాస్టల్కు వచ్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ